పూర్వం ఒకానొక రోజు రాజైన 'వీర బల్లాలుడు' వేటకు వెళ్లాడు. అలా వేటాడుతూ, వేటాడుతూ...తనతో పాటు వచ్చిన సైనికుల నుంచి వేరుపడి చీకట్లో దారి తప్పాడు. చివరకు అలసిసొలసి విశ్రమించడానికి చోటు కోసం వెతికాడు. ఇంతలో ఓ పూరి గుడిసె కనిపించింది ఆ నిర్జనారణ్యంలో.అందులో ఉన్న ఓ పండు ముదుసలిని చూసి 'అవ్వా! ఆకలి అవుతోంది ఏమైనా తినడానికి ఉందా?' అని అభ్యర్థించాడు. ఆ అవ్వ తన దగ్గర ఉడకబెట్టిన 'బెంగళు'(కన్నడ-ఓ రకమైన చిక్కుడుకాయ) తప్ప ఏమీ లేదు అంటూ ఆతిథ్యం ఇచ్చింది. అదే అమృతంగా భావించి ఆవురావురుమని తిని తన గుఱ్ఱానికి కాసిన్ని పెట్టి ఆ రాత్రి ఎలాగో గడిపేశాడు వీరబల్లాలుడు. ఈ కథ ఆనోటా ఈనోటా ప్రాకి ఆ ప్రాంతాన్ని అక్కడ మెల్లగా రూపుదిద్దుకొన్న 'ఊరు'ను 'బెంగళూరు' అని పిలవడం మొదలుపెట్టారు.
ఇట్లు..
మీ ప్రదీప్
Monday, October 8, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment